Chiranjeevi : పూరితో సినిమాకు ఓకే చెప్పిన చిరంజీవి?

Kaburulu

Kaburulu Desk

December 7, 2022 | 10:18 PM

Chiranjeevi : పూరితో సినిమాకు ఓకే చెప్పిన చిరంజీవి?

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చిరంజీవితో సినిమా ఓకే చెప్పించాడని తెలుస్తుంది. పూరీ దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం ‘లైగర్’. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు మధ్య విడుదలై ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో పూరీ సీన్ అయ్యిపోయింది అనుకున్నారంతా.

Waltair Veerayya : అభిమానులను నిరాశపరిచిన వాల్తేరు వీరయ్య..

కానీ అందరికి షాక్ ఇస్తూ పూరీ, చిరుతో సినిమా ఒప్పించాడు. ఇటీవలే చిరంజీవికి, ఈ దర్శకుడు ఒక కథ వినిపించాడు అంటా, స్టోరీ లైన్ ఆకట్టుకోవడంతో పూర్తి స్థాయిలో కథని సిద్ధం చేసుకొని రమ్మని చిరు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో డైరెక్టర్ స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు అని తెలుస్తుంది. అయితే లైగర్ వంటి ప్లాప్ తరువాత కూడా మెగాస్టార్ పూరికి అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.

గతంలోనే పూరీ.. చిరంజీవితో సినిమా చేయాల్సింది, కానీ కుదరలేదు. అయితే గాడ్ ఫాదర్ సమయంలో చిరునే ఈ దర్శకుడిని సినిమా చేద్దామని అడగడంతో పూరీ కథను వినిపించినట్లు తెలుస్తుంది.మరి ఈ వార్తల్లో నిజమెంత వరకు ఉంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.