Waltair Veerayya & Veerasimha Reddy : చెరొక వంద కోట్లు.. బాలయ్య, చిరు పండక్కి అదరకొట్టేశారు..

రెండు సినిమాలని ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. తాజాగా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని....................

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 02:57 PM

Waltair Veerayya & Veerasimha Reddy : చెరొక వంద కోట్లు.. బాలయ్య, చిరు పండక్కి అదరకొట్టేశారు..

Waltair Veerayya & Veerasimha Reddy :  ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. వీరసింహారెడ్డి పక్కా మాస్, ఎమోషనల్ సినిమా అయితే వాల్తేరు వీరయ్య పక్కా మాస్ కమర్షియల్, ఎమోషనల్ ఎంటర్టైనర్. దీంతో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకి కనెక్ట్ అయి భారీ విజయం సాధించాయి. పండగ సీజన్ కావడంతో అభిమానులతో పాటు, ఫ్యామిలీలు కూడా సినిమాలకి తరలి వచ్చారు. దీంతో సినిమాలకి కలెక్షన్ల వరద పారింది.

ఈ రెండు సినిమాలని ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. తాజాగా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా నాలుగు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంటే దాదాపు 50 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ ని సాధించింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 20 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి.

ఇక వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే దాదాపు 60 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 25 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి. ఇక ఇప్పట్లో సినిమాలు రిలీజ్ కి ఏమి లేకపోవడంతో, మరో రెండు రోజులు పండగా మూడ్ ఉండటంతో, రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Chiranjeevi : చిరంజీవి మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వని పర్సన్ ఎవరో తెలుసా?

ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్లు సాధించడంతో ఈ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో 100 కోట్లు కొల్లగొట్టారు. చిరంజీవి గత సినిమా గాడ్ ఫాదర్ కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రవితేజ ఇటీవలే ధమాకా సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నారు. ఇక బాలకృష్ణ గత సినిమా అఖండ కూడా 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి 100 కోట్లు సాధించడంతో ఈ హీరోలతో పాటు నిర్మాతలు, అభిమానులు కూడా ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.