Dil Raju : అందరూ నా మీద పడి ఏడుస్తున్నారు.. వారసుడు వాయిదా.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..

దిల్ రాజు వారసుడు సినిమా గురించి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు తో పాటు శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. వరిసు సినిమాని సంక్రాంతికి వస్తామని ఎప్పుడో చెప్పాము. తెలుగులో వారసుడుగా.............

Kaburulu

Kaburulu Desk

January 9, 2023 | 04:38 PM

Dil Raju : అందరూ నా మీద పడి ఏడుస్తున్నారు.. వారసుడు వాయిదా.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..

Dil Raju :  ఈ సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ సారి సంక్రాంతి వార్ చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఉంటుంది అనుకున్నారు. కానీ వీరిద్దరి మధ్యలో దిల్ రాజు తన డబ్బింగ్ సినిమా వారసుడుతో వస్తున్నాను అని ప్రకటించాడు. మాములుగా ఈ సినిమాని రిలీజ్ చేస్తే ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ దిల్ రాజు చాలా చోట్ల థియేటర్స్ బ్లాక్ చేసి తన వారసుడు సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఉండేలా చూసుకున్నాడు. దీంతో టాలీవుడ్ తో పాటు చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఇద్దరూ కూడా దిల్ రాజుపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో దిల్ రాజుని దారుణంగా ట్రోల్ చేశారు.

ఇప్పటికే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్స్ రిలీజ్ అవ్వడంతో ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఆదివారం నాడు జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఇండైరెక్ట్ గా దిల్ రాజుకి కౌంటర్ ఇచ్చాడు. ఇక వారసుడు ట్రైలర్ మీద బాగా నెగిటివిటి రావడంతో దిల్ రాజు ఆలోచనలో పడ్డాడు.

Shakunthalam Trailer : శాకుంతలం ట్రైలర్ రిలీజ్.. పురాణ కథని విజువల్ వండర్‌లా చూపించిన గుణశేఖర్..

తాజాగా దిల్ రాజు వారసుడు సినిమా గురించి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు తో పాటు శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. వరిసు సినిమాని సంక్రాంతికి వస్తామని ఎప్పుడో చెప్పాము. తెలుగులో వారసుడుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నాము. జనవరి 11న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించాము. కానీ తెలుగులో ఈ సినిమాని వాయిదా వేస్తూ జనవరి 14న రిలీజ్ చేస్తున్నాం. తమిళ్ తో పాటు మిగతా అన్ని చోట్ల మాత్రం జనవరి 11నే వారసుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం జనవరి 14న రిలీజ్ చేయాలని ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను. తమిళ్ లో ముందే రిలీజయి స్టోరీ బయటకి వచ్చినా ఇక్కడ కూడా సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే ధైర్యంగా సినిమాని తెలుగులో మూడు రోజులు వాయిదా వేస్తున్నాను. అందరూ నా మీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి థియేటర్స్ కావాలి, నిర్మాతలు అందరూ బాగుండాలి. వాళ్ళ కోసమే నా సినిమాని వాయిదా వేస్తున్నాను అని అన్నారు. దీంతో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.