RGV : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్జీవీ కొత్త సినిమాలు.. జగన్ ని కలిసిన కాసేపటికే ప్రకటన..

Kaburulu

Kaburulu Desk

October 28, 2022 | 08:48 AM

RGV : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్జీవీ కొత్త సినిమాలు.. జగన్ ని కలిసిన కాసేపటికే ప్రకటన..

RGV :  ఆర్జీవీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తాడు. ఆర్జీవీ పాలిటిక్స్ కి సంబంధించిన సినిమా తీస్తే ఏ సినిమాలో ఎవరి గురించి ఎలా చూపిస్తాడో అని రాజకీయ నాయకులంతా భయపడతారు. గత కొన్నేళ్లుగా ఆర్జీవీ పనిగట్టుకొని మరీ రాజకీయాలకి సంబంధించిన సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆర్జీవీ ఏపీ సీఎం జగన్ ని ఏకాంతంగా కలవడం, దాదాపు గంటసేపు మాట్లాడుకోవడం సినీ, రాజకీయ వర్గాలలో కలకలం సృష్టింస్తుంది.

జగన్ తో మీటింగ్ అయిన కొద్ది సేపటికే ఆర్జీవీ.. ”నేను వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తీయబోతున్నాను. ఇవి ఎవరి బయోపిక్ లు కాదు, కానీ రియల్ పిక్ లు. ఇందులో అన్ని నిజాలే ఉంటాయి. నేను ఎవరి కోసం తీస్తున్నానో చెప్పకపోయినా మీరే రాసేసుకుంటారు. మొదటి సినిమా వ్యూహం చూసి ప్రేక్షకులు తేరుకునేలోపే రెండో సినిమా శపథం చూపిస్తాను. ఎన్నికలని టార్గెట్ పెట్టి ఈ సినిమా తీయట్లేదు. మీరు అలా అనుకుంటే నేనేమి చెయ్యలేను. నా వంగవీటి సినిమా నిర్మాత దాసరి అరుణ్ తో ఈ సినిమా నిర్మించబోతున్నాను” అని ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేసి అందరికి షాకిచ్చాడు.

Puri Jagannadh : నాకు ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పూరి జగన్నాధ్..

జగన్ ని కలిసిన కొద్ది సేపటికే ఇలా సినిమాలు ప్రకటించడంతో ఈ సారి జగన్ కి అనుకూలంగా సినిమాలు తీయబోతున్నాడని అంతా అనుకుంటున్నారు, మరి ఆర్జీవీ ఈ సినిమాల్లో ఏ ఏ అంశాలు చూపిస్తాడో అని అటు సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇటు ప్రేక్షకులు కూడా తెగ ఆలోచిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఏపీ రాజకీయాల్లో కచ్చితంగా సంచలనం సృష్టిస్తాయి అని అనుకుంటున్నారు.