RGV : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్జీవీ కొత్త సినిమాలు.. జగన్ ని కలిసిన కాసేపటికే ప్రకటన..
![RGV : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్జీవీ కొత్త సినిమాలు.. జగన్ ని కలిసిన కాసేపటికే ప్రకటన..](https://kaburulu.com/wp-content/uploads/2022/10/rgv-1.jpg)
RGV : ఆర్జీవీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తాడు. ఆర్జీవీ పాలిటిక్స్ కి సంబంధించిన సినిమా తీస్తే ఏ సినిమాలో ఎవరి గురించి ఎలా చూపిస్తాడో అని రాజకీయ నాయకులంతా భయపడతారు. గత కొన్నేళ్లుగా ఆర్జీవీ పనిగట్టుకొని మరీ రాజకీయాలకి సంబంధించిన సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆర్జీవీ ఏపీ సీఎం జగన్ ని ఏకాంతంగా కలవడం, దాదాపు గంటసేపు మాట్లాడుకోవడం సినీ, రాజకీయ వర్గాలలో కలకలం సృష్టింస్తుంది.
జగన్ తో మీటింగ్ అయిన కొద్ది సేపటికే ఆర్జీవీ.. ”నేను వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తీయబోతున్నాను. ఇవి ఎవరి బయోపిక్ లు కాదు, కానీ రియల్ పిక్ లు. ఇందులో అన్ని నిజాలే ఉంటాయి. నేను ఎవరి కోసం తీస్తున్నానో చెప్పకపోయినా మీరే రాసేసుకుంటారు. మొదటి సినిమా వ్యూహం చూసి ప్రేక్షకులు తేరుకునేలోపే రెండో సినిమా శపథం చూపిస్తాను. ఎన్నికలని టార్గెట్ పెట్టి ఈ సినిమా తీయట్లేదు. మీరు అలా అనుకుంటే నేనేమి చెయ్యలేను. నా వంగవీటి సినిమా నిర్మాత దాసరి అరుణ్ తో ఈ సినిమా నిర్మించబోతున్నాను” అని ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేసి అందరికి షాకిచ్చాడు.
Puri Jagannadh : నాకు ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పూరి జగన్నాధ్..
జగన్ ని కలిసిన కొద్ది సేపటికే ఇలా సినిమాలు ప్రకటించడంతో ఈ సారి జగన్ కి అనుకూలంగా సినిమాలు తీయబోతున్నాడని అంతా అనుకుంటున్నారు, మరి ఆర్జీవీ ఈ సినిమాల్లో ఏ ఏ అంశాలు చూపిస్తాడో అని అటు సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇటు ప్రేక్షకులు కూడా తెగ ఆలోచిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఏపీ రాజకీయాల్లో కచ్చితంగా సంచలనం సృష్టిస్తాయి అని అనుకుంటున్నారు.
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .
రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .
ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022