Harish Shankar : పవన్ ఫ్యాన్స్ ఎక్కువ చేశారు..అందుకే నేను చెప్పను.. వైరల్ అవుతున్న హరీష్ శంకర్ కామెంట్స్..

హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తమిళ్ తేరి సినిమాకి రీమేక్ అని వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ ఫ్యాన్స్ రీమేక్ సినిమా వద్దు, తేరి సినిమా అయితే అస్సలు వద్దు అంటూ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని టార్గెట్ చేస్తూ రచ్చ చేశారు. ఇప్పటికే...................

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 02:08 PM

Harish Shankar : పవన్ ఫ్యాన్స్ ఎక్కువ చేశారు..అందుకే నేను చెప్పను.. వైరల్ అవుతున్న హరీష్ శంకర్ కామెంట్స్..

Harish Shankar :  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు రెండేళ్ల నుంచి సాగుతూనే ఉంది పవన్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల. ఇక మిగిలిన రెండు సినిమాలు పూజా కార్యక్రమాలు చేసుకున్నాయి. పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు.

అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తమిళ్ తేరి సినిమాకి రీమేక్ అని వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ ఫ్యాన్స్ రీమేక్ సినిమా వద్దు, తేరి సినిమా అయితే అస్సలు వద్దు అంటూ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని టార్గెట్ చేస్తూ రచ్చ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసినవి చాలా సినిమాలు రీమేక్స్ అవ్వడంతో అభిమానులు రీమేక్ అయితే వద్దు అంటున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలంటూ హరీష్ శంకర్ ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్టులు చేశారు. కొంతమంది పవన్ ఫ్యాన్స్ రీమేక్ వద్దంటూ హరీష్ శంకర్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో హరీష్ శంకర్ దీనిపై స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా రీమేక్ సినిమానా కాదా అనేది నేను చెప్దామనుకున్నాను. కానీ ఫ్యాన్స్ చాలా ఓవర్ చేశారు. కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ చేశారు. నేను ఫ్యాన్స్ ని మంచిగా ట్రీట్ చేసినా వాళ్ళు అతి చేశారు. నేను కూడా పవన్ అభిమానినే. అందుకే పవన్ సినిమా రీమేకా కాదా అనేది ఇప్పుడు నేను చెప్పను, డైరెక్ట్ థియేటర్లో రిలీజ్ అయ్యాక వాళ్ళే చూసుకుంటారు అని అనడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారి మరోసారి పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు.

CCL 2023 : మళ్ళీ మన హీరోలు క్రికెట్ బ్యాట్ పెట్టబోతున్నారు.. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ వచ్చేస్తోంది..

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్న రచయిత, దర్శకుడు దశరథ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా తేరి సినిమాకు రీమేక్. కానీ కేవలం మెయిన్ లైన్ మాత్రమే తీసుకొని పూర్తిగా పవన్ కి, అభిమానులకి తగ్గట్టు మారుస్తున్నాము అని అన్నాడు. దీంతో ఆ సినిమా రీమేక్ అని క్లారిటీ రావడంతో అభిమానులు మరోసారి రీమేక్ వద్దంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.