Chiranjeevi : ఆ బాధ ఉంది.. డైరెక్టర్ చెప్పిందే చేశాం.. ఆచార్య ఫలితంపై మరోసారి స్పందించిన చిరంజీవి..

Kaburulu

Kaburulu Desk

October 2, 2022 | 02:36 AM

Chiranjeevi : ఆ బాధ ఉంది.. డైరెక్టర్ చెప్పిందే చేశాం.. ఆచార్య ఫలితంపై మరోసారి స్పందించిన చిరంజీవి..

Chiranjeevi :  చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య ఆశించినంత విజయం సాధించలేదు. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఈ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. కానీ అభిమానుల ఆశలని నిరాశపరిచింది. భారీ నష్టాన్ని కూడా మిగిల్చింది ఆచార్య. ఈ సినిమాపై ఇప్పటికే పలు సార్లు చిరంజీవి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. తాజాగా మరోసారి ఈ సినిమాపై స్పందించారు.

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా త్వరలో దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా కావడం, ఇందులో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆచార్య గురించి అడగగా చిరంజీవి తన మనసులో మాటని బయటపెట్టేశారు.

Abhishek Bachchan : అభిషేక్-ఐశ్వర్య విడాకులు.. రెండోపెళ్లి మీరే చేయాలని కౌంటర్ ఇచ్చిన అభిషేక్..

చిరంజీవి ఆచార్య ఫలితం గురించి మాట్లాడుతూ.. ”ఆచార్య ప్లాప్ అయినందుకు నేనేం బాధపడలేదు. డైరెక్టర్ చెప్పిందే మేము చేశాం. కాకపోతే నేను, చరణ్ కలిసి మొదటిసారి చేశాము. సినిమాపై అంచనాలు ఉన్నాయి. మేమిద్దరం కలిసి చేసిన సినిమా ఫ్లాప్ అయిందని కొద్దిగా బాధ ఉంది. తర్వాత ఎప్పుడైనా మేమిద్దరం కలిసి చేస్తే అంత హైప్ ఉండదేమో” అని అన్నారు. దీంతో చిరంజీవి ఆచార్య గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.