Chiranjeevi : శృతిహాసన్‌ని ఒంగోలు ఫంక్షన్‌లో ఎవరో భయపెట్టారు.. చిరంజీవి!

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నాకు హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. ఆమె మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్ కోసం ఒంగోలు వెళ్ళినప్పుడు..

Kaburulu

Kaburulu Desk

January 9, 2023 | 06:14 PM

Chiranjeevi : శృతిహాసన్‌ని ఒంగోలు ఫంక్షన్‌లో ఎవరో భయపెట్టారు.. చిరంజీవి!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్‌గా దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. కె బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ముఠామేస్త్రి తరువాత చిరు మళ్ళీ ఆ తరహా పాత్రలో కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

Ravi Teja : పక్కన కూర్చుంటా అని చెప్పా.. ఇప్పుడు ఏకంగా సంక ఎక్కి కూర్చున్నా.. రవితేజ!

ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాకు హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. ఆమె మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్ కోసం ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి తిన్నదో ఏంటో సడన్ గా జ్వరం వచ్చింది అంటా. అయితే ఆ జ్వరం ఏమన్నా తింటే వచ్చిందా లేక ఎవరన్నా భయపెడితే వచ్చిందో’ అంటూ జోక్ చేశాడు. కాగా శృతిహాసన్, చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు.

సడన్ గా ఫీవర్ వచ్చింది. కరోనా టెస్ట్ కూడా చేయిస్తున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలి అని అనుకున్నాను కానీ కుదరలేదు. మూవీ టీంకి, ఫ్యాన్స్ కి నా తరుపు నుంచి క్షమాపణలు చెప్పండి అంటూ శృతి మాట్లాడినట్లు వెల్లడించాడు. అలాగే ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరున్నాడు చిరంజీవి. కాగా సినిమాలోని శృతిహాసన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘శృతిని కేవలం గ్లామర్ టచ్ కోసం పెట్టలేదు. కథలో, ఒక యాక్షన్ సీన్ లో ఆమె ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఇక ఫ్రాన్స్ లో సాంగ్స్ షూటింగ్ సమయంలో.. మైనస్ 8 డిగ్రీలలో చీరలో ఒణికి పోయేది. అయినా సరే ఆ బాధని పేస్ లో కనిపించకుండా పాటలో చాలా అందంగా డాన్స్ వేసింది. శృతి యాక్టింగ్ పై నీకు ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్’ అంటూ ప్రశంసించాడు.