Bhola Shankar : భోళాశంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఆనందంలోనే తన తదుపరి సినిమాని పట్టాలు ఎక్కించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాకి భోళాశంకర్ అనే టైటిల్ ని పెట్టారు.

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 07:05 PM

Bhola Shankar : భోళాశంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరంజీవి.

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా నటించాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి చాలా రోజులు తరువాత వింటేజ్ లుక్ లో కనిపించడమే కాకుండా ఒకప్పటి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు.

Waltair Veerayya & Veerasimha Reddy : చెరొక వంద కోట్లు.. బాలయ్య, చిరు పండక్కి అదరకొట్టేశారు..

దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం మూడు రోజులోనే దాదాపు రూ.108 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి చిరంజీవి స్టామినా ఏంటో నిరూపించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఆనందంలోనే తన తదుపరి సినిమాని పట్టాలు ఎక్కించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాకి భోళాశంకర్ అనే టైటిల్ ని పెట్టారు.

ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే మొదలయింది. అయితే మధ్యలో గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల వల్ల కొంచెం బ్రేక్ తీసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ నిన్న మొదలు పెట్టారు. ఈ మూవీ కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్ లో నడవనుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ భారీ కోల్‌కత్తా సెట్ ని నిర్మించింది. ఈ సెట్ లో దర్శకనిర్మాతలు ఫోటో దిగి షూటింగ్ మొదలయింది అంటూ ఆ ఫోటోని షేర్ చేశారు.

కాగా ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టు అయిన అజిత్ ‘వేదాళం’కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో చిరుకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. మరో హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. శర వేగంగా షూటింగ్ పూర్తి వేసవిలో లేదా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది చిత్ర యూనిట్.