Chiranjeevi : ఆపదలో ఉన్న పవన్ గుర్తుకు వచ్చి కన్నీరు వచ్చాయి.. చిరంజీవి!

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలెబ్రేషన్స్ నిన్న వరంగల్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిరు, పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 11:43 AM

Chiranjeevi : ఆపదలో ఉన్న పవన్ గుర్తుకు వచ్చి కన్నీరు వచ్చాయి.. చిరంజీవి!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులకు పూనకాలు రప్పించింది. రీ ఎంట్రీ తరువాత నుంచి మిస్ అవుతున్న వింటేజ్ చిరుని దర్శకుడు బాబీ పరిచయం చేయడంతో జనరల్ ఆడియన్స్ కూడా థియేటర్లకి క్యూ కట్టేలా చేసింది. ఈ సినిమాలో మరో హీరో రవితేజ, చిరంజీవికి తమ్ముడు పాత్రలో కనిపించాడు. మూవీలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్‌టైన్ చేస్తూనే, ఎమోషనల్ గా కూడా ఏడిపించేశాయి.

Ram Charan’s Quiet Warning to Minister Roja?

ముఖ్యంగా సినిమాలో రవితేజ చనిపోయే సన్నివేశంలో.. చిరంజీవి చేసిన యాక్టింగ్ అందర్నీ కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశంలో చిరు గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు తీసుకు వచ్చాడు. దాని గురించి మాట్లాడుతూ.. ‘రవితేజ నాకు మరో పవన్ కళ్యాణ్ లాంటి వాడు. సినిమాలో అది కేవలం తమ్ముడు క్యారెక్టర్ అయ్యి ఉండవచ్చు. కానీ ఆ సన్నివేశంలో వెన్ను పోటీకి గురై చనిపోయి పరిస్థితిలో ఉన్న రవితేజని చూస్తే, నాకు అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చాడు. తమ్ముడికి ఏమైపోతుందో అన్న భయం, ఆవేదన నాకు ఆ సమయంలో కన్నీళ్లు వచ్చేలా చేశాయి’ అంటూ చిరు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిరు వెల్లడించాడు. ఈ మూవీ తీస్తున్నప్పుడే విజయం సాధిస్తుంది అని అనుకున్నాము. కానీ ఈ రేంజ్ లో హిట్టు అవుతుంది అని అనుకోలేదు. నాన్ బాహుబలి, నాన్ RRR స్థాయిలో ఈ సినిమాని హిట్టు చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు చిరంజీవి. అలాగే నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మేము తీసిన ఏ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ చూడ లేదు అంటూ వెల్లడించాడు.