కియారా అద్వానీ, బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది అంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పుడు స్పందించ లేదు.
తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించి, ప్రేమ వార్తలు నిజమని తెలియజేశారు.
ఫిబ్రవరి 4-6 వరకు ఈ వివాహ వేడుకలు రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో జరగనున్నాయి.
ఈ క్రమంలోనే ఈరోజు కియారా అద్వానీ కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో ముంబై నుంచి రాజస్థాన్కి బయలుదేరింది.
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహందీ, హల్దీ, సంగీత్ ఈవెంట్స్ జరగనున్నాయి.
ఫిబ్రవరి 6న వీరిద్దరూ పంజాబీ సంప్రదాయంలో ఒకటి కానున్నారు.
ఈ వివాహానికి బాలీవుడ్లోని పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు.