టాలీవుడ్ సీనియర్ నటుడు 'కైకాల సత్యనారాయణ' డిసెంబర్ 23న మరణించారు.
పౌరాణికం, జానపదం.. ఇలా అన్ని జోనర్లో నటించి "నవరస నటనా సార్వభౌమ" అనిపించుకున్నారు.
కెరీర్ మొదటిలో సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా నటించారు కైకాల. ఆ తరువాత ఎన్టీఆర్ సహాయంతో సినిమా ఛాన్సులు అందుకున్నారు.
'అరుంధతి' సినిమా రిలీజ్ సమయంలో తన మనసులోని కోరికను బయటపెట్టారు.
"870 సినిమాల్లో నటించిన నేను.. 1000 కాకపోయినా 900 సినిమాల్లో అయినా నటించాలి" అంటూ తన కోరికను చెప్పారు.
కానీ ఆ కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు.
అయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి.
ఏదేమైనా తెలుగుతెరపై ఆయన గుర్తులు చిరస్మరణీయం.