గులాబీ, పెళ్లి.. లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన మహేశ్వరికి శ్రీదేవి పిన్ని అవుతుంది.
తమిళ్, తెలుగులో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన మహేశ్వరి 2000 సంవత్సరం తర్వాత సినిమాలకి దూరంగా వెళ్ళిపోయింది.
అప్పుడప్పుడు టీవీ షోలలో మాత్రం సందడి చేసేది.
తాజాగా జాన్వీ హైదరాబాద్ రావడంతో మహేశ్వరి జాన్వితో పాటు వచ్చి సందడి చేసింది.
తన అక్కతో కలిసి దిగిన ఫోటోలని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మహేశ్వరిని చూసి చాలా రోజులైంది, చాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..